ఎన్నికల కోసం భారీ భద్రత..రంగంలోకి లక్ష మంది బలగాలు
- December 06, 2018
ఎన్నికల కోసం పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బందోబస్తుకు రాష్ట్ర పోలీస్ సిబ్బందితోపాటు 6 రాష్ట్రాలు, పలు కేంద్ర బలగాల నుంచి భారీగా సిబ్బందిని రంగంలోకి దించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ విస్తృతం చేస్తూనే అక్కడి ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఎన్నికల కోసం 414 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 404 స్పెషల్ స్క్వాడ్స్, 3 వేల 385 సంచార బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4 వేల సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, కరీంనగర్ జిల్లాలున్నాయి. భద్రత కోసం 276 కేంద్ర బలగాలు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, కర్నాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒడిశా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 20వేలమందిని రంగంలోకి దించారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో 11 వేల 853 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేశారు పోలీసులు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇప్పటి వరకు వేయి 314 కేసులు నమోదయ్యాయి. తనిఖీల సందర్భంగా 17 వేల 841 సెక్యూరిటీ కేసులను నమోదు చేయగా… 90 వేల 128 మందిని బైండోవర్ చేశారు. 8 వేల 481 లైసెన్సుడు ఆయుధాలను డిపాజిట్ చేసుకోగా.. 11 అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 39 ఆయుధాల లైసెన్సులను రద్దు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పలువురు అధికారులను జిల్లాలకు ఇన్చార్జి అధికారులుగా నియమించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







