బ్రెజిల్ బ్యాంక్ రాబరీ: 14 మంది కాల్చివేత...
- December 08, 2018బ్రెజిల్:బ్రెజిల్ దేశం నార్త్ ఈస్ట్ ప్రాంతం సీరా రాష్ట్రంలోని మిలాగ్రిస్ పట్టణం. మెయిన్ రోడ్డులో వరసగా రెండు బ్యాంకులు ఉన్నాయి. ఏటీఎంలు కూడా ఉన్నాయి. లావాదేవీలు భారీగా జరుగుతుంటాయి. రద్దీగా ఉంటుంది. ఈ రెండు బ్యాంకులు పక్కపక్కనే ఉండటం, భారీగా డబ్బు ఉంటుందని భావించిన ఓ గ్యాంగ్ దోపిడీకి స్కెచ్ వేసింది. అనుకున్నదే ప్లాన్ అమలు చేసింది గ్యాంగ్. మొత్తం ఐదుగురు. ముసుగులు వేసుకున్నారు.. గన్స్, ఇతర కట్టర్లు రెడీ చేసుకుని పెద్ద వ్యాన్ లో బ్యాంక్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందర్నీ నిర్బంధించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు.
ఓపెన్ ఫైరింగ్ :
బ్యాంకు దోపిడీదారులపై పోలీసులు ఓపెన్ ఫైరింగ్ చేశారు. విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. లోపల ఎంత మంది ఉన్నారు.. ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని పట్టించుకోకుండా తుపాకుల మోత మోగించటంతో 14 మంది చనిపోయారు. వీరిలో ఐదుగురు దోపిడీదారులు.
మిగిలిన 9 మంది బ్యాంకుకి వచ్చిన కస్టమర్లు, సిబ్బంది ఉన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉండటం విషాదం. కాల్పుల కాల్పులపై బ్రెజిల్ లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముందూ వెనకా చూడకుండా కాల్పులకు దిగటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.బ్రెజిల్ కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..