లక్జెంబర్గ్:బస్సు, రైలు, మెట్రో.. ఏదెక్కినా ఫ్రీ..
- December 08, 2018
లక్జెంబర్గ్:ఎంత హాయి.. బస్సెక్కగానే పర్సులో చేయిపెట్టి చిల్లర కోసం వెతుక్కోవాల్సిన పన్లేదు. కండక్టర్ ప్రయాణీకుల మధ్యలోనుంచి టిక్కెట్.. టిక్కెట్ అంటూ తోసుకుని రావాల్సిన పని అంతకంటే లేదు. ఇదేదో మనదేశంలో కూడా పెడితే ఎంత బావుండు అని అనిపిస్తోంది కదూ.
ప్చ్.. అంత భాగ్యం మనకు లేదు. రవాణా సంస్థ నష్టాల్లో ఉందంటూ ప్రయాణీకులపై భారాన్ని మోపడానికే చూస్తుంటాయి ఇక్కడి ప్రభుత్వాలు. ఫ్రీ అక్కర్లేదు బాబూ. కనీసం రద్దీ మార్గాల్లో తగినన్ని బస్సులు వేస్తే అదే పదివేలు అని కదా అనుకునేది.
ఇంతకీ ఫ్రీ ఎక్కడనుకుంటున్నారు.. యూరోప్ కంట్రీస్లో ఒకటైన లక్జెంబర్గ్లో.. మామూలుగానే అక్కడ రవాణా చార్జీలు చాలా తక్కువ. త్వరలోనే అధికారం చేపట్టనున్న సంకీర్ణ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఈ శుభవార్త చెప్పింది. వచ్చే వేసవి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
ప్రపంచంలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశం లక్జెంబర్గ్ కావడం విశేషం. ఇంతకు ముందు రెండు గంటల ప్రయాణానికి రెండు డాలర్లు వసూలు చేసేవారు. ఇప్పుడు అది కూడా లేదు. ఈ చిన్న దేశంలో ఎక్కడికి వెళ్లాలన్న రెండు గంటల కంటే ఎక్కువ ప్రయాణం ఉండదు.
ఇక్కడి ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థపై ఏడాదికి బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.7వేల కోట్లకు పైనే) ఖర్చు చేస్తోంది. కానీ ప్రజల నుంచి సంస్థకు వచ్చే ఆదాయం అందులో మూడో వంతు మాత్రమే. ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేసి ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది. ఇంతకీ ఇక్కడ జనాభా ఎంతంటే.. ఆరు లక్షల మంది మాత్రమే. అయితే ప్రతి రోజూ ఇక్కడికి వివిధ పనుల నిమిత్తంగా పక్క దేశాల నుంచి వచ్చే వారు రెండు లక్షల మంది వరకు ఉంటారట. ఈసారి విదేశీ విహార యాత్రల లిస్టులో లక్జెంబర్గ్ చేరిస్తే సరి.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







