ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా

- December 08, 2018 , by Maagulf
ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా

ఇప్పటికే కేంబ్రిడ్జ్‌ అనలిటికా కుంభకోణంతో ఫేస్‌బుక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాంతో పలు దేశాల్లో ఫేస్‌బుక్‌ జరిమానాలు కట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా మరో దేశం(ఇటలీ) ఫేస్‌బుక్‌ కు భారీ జరిమానా విధించింది. యూజర్ల అనుమతి లేకుండా వారి వివరాలను విక్రయిస్తోందని ఆరోపిస్తూ వినియోగదారుల భద్రత చట్టాలను ఫేస్‌బుక్‌ ఉల్లంగించినదని పేర్కొంది. దాంతో ఫేస్‌బుక్‌ కు 8.9 మిలియన్‌ యూరోల(ఇండియా కరెన్సీలో రూ. 70కోట్లకు పైమాటే) జరిమానా విధించింది. అయితే ఫేస్‌బుక్‌ మాత్రం తాము ఖాతాదారుల డేటాను విక్రయించలేదని వాదిస్తోంది. కాగా అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో కోట్లాది మంది ఫేస్‌బుక్‌ యూజర్లు తమ డేటా దుర్వినియోగం అయిందని ఆరోపించారు. అప్పట్లో ఫేస్‌బుక్‌ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com