అరుదైన రికార్డును సొంతం చేసుకున్న కేరళ
- December 09, 2018
కేరళ:దేశంలోకెల్లా ఎక్కువ అంతర్జాతీయ విమానాశ్రయాలు కల్గిన రాష్ట్రంగా కేరళ ఘనత సాధించింది. కన్నూరులో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్ప్రభు, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్లు ప్రారంభించారు. ఈ విమానాశ్రయంతో కేరళలో ఇంట ర్నేషనల్ ఎయిర్పోర్టుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో దేశంలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఒకే ఒక్క రాష్ట్రంగా కేరళ నిలిచింది.
ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అనంతరం మొదట రెండు విమానాలు గాల్లోకి ఎగిరాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ కన్నూరు నుంచి అబుధాబికి సర్వీస్ నడిపింది. గోఎయిర్ విమానయాన సంస్థ కన్నూరు నుంచి బెంగళురుకు తన సర్వీసు ప్రారంభించింది. ఇన్నాళ్లూ కోజికోడ్ ఎయిర్పోర్టుపై ఆధారపడిన పరిసర గ్రామాలకు ప్రజలు, ఇప్పుడు కన్నూరు ఎయిర్పోర్టు సేవలను వినియోగించుకునే అవకాశం లభించింది.
కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును 18వందల కోట్ల వ్యయంతో 2వేల ఎకరాల్లో నిర్మించారు. ఏడాదికి 15 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయ సేవలు ఉయోగించుకుంటున్నారని అంచనా. ఇక, కేరళలో ఇప్పటికే రాష్ట్ర రాజధాని తిరువనంతపురంతో పాటు కోచి, కోజికోడ్లలో అంతర్జాతీయ విమానాశ్రయలున్నాయి. కన్నూరు ఎయిర్ పోర్టు రాకతో ఆ సంఖ్య నాలుగుకు పెరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







