అరుదైన రికార్డును సొంతం చేసుకున్న కేరళ
- December 09, 2018కేరళ:దేశంలోకెల్లా ఎక్కువ అంతర్జాతీయ విమానాశ్రయాలు కల్గిన రాష్ట్రంగా కేరళ ఘనత సాధించింది. కన్నూరులో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేశ్ప్రభు, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్లు ప్రారంభించారు. ఈ విమానాశ్రయంతో కేరళలో ఇంట ర్నేషనల్ ఎయిర్పోర్టుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో దేశంలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఒకే ఒక్క రాష్ట్రంగా కేరళ నిలిచింది.
ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అనంతరం మొదట రెండు విమానాలు గాల్లోకి ఎగిరాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ కన్నూరు నుంచి అబుధాబికి సర్వీస్ నడిపింది. గోఎయిర్ విమానయాన సంస్థ కన్నూరు నుంచి బెంగళురుకు తన సర్వీసు ప్రారంభించింది. ఇన్నాళ్లూ కోజికోడ్ ఎయిర్పోర్టుపై ఆధారపడిన పరిసర గ్రామాలకు ప్రజలు, ఇప్పుడు కన్నూరు ఎయిర్పోర్టు సేవలను వినియోగించుకునే అవకాశం లభించింది.
కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును 18వందల కోట్ల వ్యయంతో 2వేల ఎకరాల్లో నిర్మించారు. ఏడాదికి 15 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయ సేవలు ఉయోగించుకుంటున్నారని అంచనా. ఇక, కేరళలో ఇప్పటికే రాష్ట్ర రాజధాని తిరువనంతపురంతో పాటు కోచి, కోజికోడ్లలో అంతర్జాతీయ విమానాశ్రయలున్నాయి. కన్నూరు ఎయిర్ పోర్టు రాకతో ఆ సంఖ్య నాలుగుకు పెరిగింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!