అడిలైడ్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

- December 10, 2018 , by Maagulf
అడిలైడ్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

అడిలైడ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంచ్ బ్రేక్ వరకూ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఔటైనప్పటకీ.. టెయిలెండర్లు పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. లంచ్ తర్వాత టిమ్ పెయిన్ 41 పరుగలకు ఔటవగా.. టెయిలెండర్లు పోరాడారు. స్టార్క్‌, కమ్మిన్స్‌తో పాటు నాథన్ ల్యాన్ భారత బౌలర్లను విసిగించారు. అయితే చివరికి హ్యాజిల్‌వుడ్‌ను అశ్విన్‌ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com