పుట్టినరోజు వేడుకలకు తలైవా దూరం
- December 12, 2018
చెన్నై:ఈ ఏడాది సూపర్స్టార్ రజనీకాంత్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు. బుధవారం ఆయన జన్మదినం కావడంతో అభిమానులు, రజనీ మక్కల్ మండ్రం సభ్యులు వేడుకలకు సిద్ధమయ్యారు. రజనీకాంత్ మాత్రం వీటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన గజ తుపాను బాధితులను ఆదుకోవాలని తన నూతన సినిమా ఆడియో విడుదల సందర్భంగా పిలుపునిచ్చిన ఆయన... పుట్టిన రోజు సందర్భంగా తన నివాసానికి రావద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. నిరాశపరిచి ఉంటే క్షమించాలని కోరారు. అందులో భాగంగానే వేడుకలకు దూరమైనట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి ముంబై బయలుదేరి వెళ్లారు. వారం చివరికి తిరిగి వస్తారని తెలిసింది. గతేడాది చివరి రోజున రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేసిన రజనీకాంత్ ఆ తర్వాత రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు చేశారు. ఇంతవరకు పార్టీకి సంబంధించిన జెండా, అజెండా, ప్రారంభం తదితర విషయాలను ప్రస్తావించలేదు.
మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఈ పుట్టిన రోజుకు రజనీకాంత్ రాజకీయ పార్టీకి సంబంధించి ప్రకటన ఏదైనా చేస్తారేమోనని ఎదురు చూసిన అభిమానులకు కొంత నిరాశే ఎదురైంది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన







