పుట్టినరోజు వేడుకలకు తలైవా దూరం
- December 12, 2018
చెన్నై:ఈ ఏడాది సూపర్స్టార్ రజనీకాంత్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు. బుధవారం ఆయన జన్మదినం కావడంతో అభిమానులు, రజనీ మక్కల్ మండ్రం సభ్యులు వేడుకలకు సిద్ధమయ్యారు. రజనీకాంత్ మాత్రం వీటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన గజ తుపాను బాధితులను ఆదుకోవాలని తన నూతన సినిమా ఆడియో విడుదల సందర్భంగా పిలుపునిచ్చిన ఆయన... పుట్టిన రోజు సందర్భంగా తన నివాసానికి రావద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. నిరాశపరిచి ఉంటే క్షమించాలని కోరారు. అందులో భాగంగానే వేడుకలకు దూరమైనట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి ముంబై బయలుదేరి వెళ్లారు. వారం చివరికి తిరిగి వస్తారని తెలిసింది. గతేడాది చివరి రోజున రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేసిన రజనీకాంత్ ఆ తర్వాత రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు చేశారు. ఇంతవరకు పార్టీకి సంబంధించిన జెండా, అజెండా, ప్రారంభం తదితర విషయాలను ప్రస్తావించలేదు.
మరోవైపు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఈ పుట్టిన రోజుకు రజనీకాంత్ రాజకీయ పార్టీకి సంబంధించి ప్రకటన ఏదైనా చేస్తారేమోనని ఎదురు చూసిన అభిమానులకు కొంత నిరాశే ఎదురైంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









