టర్కీ లో ఘోర రైలు ప్రమాదం
- December 13, 2018
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో 47 మంది గాయపడ్డారు. ఓ హై స్పీడ్ రైలు మరో రైలును ఢీకొన్నది. ఎమర్జెన్సీ వర్కర్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అంకారా నుండి కోన్యా పట్టణం వైపు వెళ్తున్న రైలు ఈ ప్రమాదానికి గురైంది. అంకారా ప్రధాన స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్సాండిజ్ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ డ్రైవర్తో పాటు మరో ఇద్దరు సిబ్బంది, ఆరు మంది ప్రయాణికులు మరణించినవారిలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 206 మంది ప్రయాణికులు ఉన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









