టర్కీ లో ఘోర రైలు ప్రమాదం

- December 13, 2018 , by Maagulf
టర్కీ లో ఘోర రైలు ప్రమాదం

అంకారా: టర్కీ రాజధాని అంకారాలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో 47 మంది గాయపడ్డారు. ఓ హై స్పీడ్‌ రైలు మరో రైలును ఢీకొన్నది. ఎమర్జెన్సీ వర్కర్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అంకారా నుండి కోన్యా పట్టణం వైపు వెళ్తున్న రైలు ఈ ప్రమాదానికి గురైంది. అంకారా ప్రధాన స్టేషన్‌ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్సాండిజ్‌ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ట్రైన్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది, ఆరు మంది ప్రయాణికులు మరణించినవారిలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 206 మంది ప్రయాణికులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com