రెడ్ బస్ టీమ్పై ప్రయాణీకుల అసహనం
- December 13, 2018
బహ్రెయిన్: కింగ్డమ్లో ఇటీవల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని బలోపేతం చేసేందుకోసం రెడ్ బస్లను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే, ప్రయాణీకులు ఈ సిస్టమ్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'బిలో యావరేజ్' మార్కులు మాత్రమే ఈ సిస్టమ్కి ఇస్తున్నారు ప్రయాణీకులు. పంక్చువాలిటీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. రెడ్ బస్ వినియోగదారుల్లో ఎక్కువమంది తక్కువ ఆదాయం గల కార్మికులే. ఈ కారణంతో ఎక్కడ తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలో వారికి తెలియడంలేదు. పంక్చువాలిటీ లేకపోవడం రెడ్ బస్ సిస్టమ్ ప్రధాన లోపమని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సమాచారం అందుకునే వీలున్నా, అది కూడా సరిగ్గా పని చేయడంలేదనీ, ఈ కారణంగా సామాన్యులు అసహనానికి గురవుతున్నారని తెలుస్తోంది. మార్గమధ్యంలో డ్రైవర్లు ట్రిప్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







