రెడ్ బస్ టీమ్పై ప్రయాణీకుల అసహనం
- December 13, 2018
బహ్రెయిన్: కింగ్డమ్లో ఇటీవల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని బలోపేతం చేసేందుకోసం రెడ్ బస్లను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే, ప్రయాణీకులు ఈ సిస్టమ్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'బిలో యావరేజ్' మార్కులు మాత్రమే ఈ సిస్టమ్కి ఇస్తున్నారు ప్రయాణీకులు. పంక్చువాలిటీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. రెడ్ బస్ వినియోగదారుల్లో ఎక్కువమంది తక్కువ ఆదాయం గల కార్మికులే. ఈ కారణంతో ఎక్కడ తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలో వారికి తెలియడంలేదు. పంక్చువాలిటీ లేకపోవడం రెడ్ బస్ సిస్టమ్ ప్రధాన లోపమని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సమాచారం అందుకునే వీలున్నా, అది కూడా సరిగ్గా పని చేయడంలేదనీ, ఈ కారణంగా సామాన్యులు అసహనానికి గురవుతున్నారని తెలుస్తోంది. మార్గమధ్యంలో డ్రైవర్లు ట్రిప్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







