రెడ్‌ బస్‌ టీమ్‌పై ప్రయాణీకుల అసహనం

- December 13, 2018 , by Maagulf
రెడ్‌ బస్‌ టీమ్‌పై ప్రయాణీకుల అసహనం

బహ్రెయిన్‌: కింగ్‌డమ్‌లో ఇటీవల పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ని బలోపేతం చేసేందుకోసం రెడ్‌ బస్‌లను ఇంట్రడ్యూస్‌ చేశారు. అయితే, ప్రయాణీకులు ఈ సిస్టమ్‌ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'బిలో యావరేజ్‌' మార్కులు మాత్రమే ఈ సిస్టమ్‌కి ఇస్తున్నారు ప్రయాణీకులు. పంక్చువాలిటీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. రెడ్‌ బస్‌ వినియోగదారుల్లో ఎక్కువమంది తక్కువ ఆదాయం గల కార్మికులే. ఈ కారణంతో ఎక్కడ తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలో వారికి తెలియడంలేదు. పంక్చువాలిటీ లేకపోవడం రెడ్‌ బస్‌ సిస్టమ్‌ ప్రధాన లోపమని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ యాప్‌ ద్వారా సమాచారం అందుకునే వీలున్నా, అది కూడా సరిగ్గా పని చేయడంలేదనీ, ఈ కారణంగా సామాన్యులు అసహనానికి గురవుతున్నారని తెలుస్తోంది. మార్గమధ్యంలో డ్రైవర్లు ట్రిప్‌ని క్యాన్సిల్‌ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com