కన్నీళ్ల పర్యంతమైన ముకేశ్ అంబానీ

- December 13, 2018 , by Maagulf
కన్నీళ్ల పర్యంతమైన ముకేశ్ అంబానీ

ముంబయి: కూతురు అత్తారింటికి పంపుతుంటే ఏ తండ్రైనా కనీళ్లు పెట్టుకోకుండా ఉండాలేడు అది అపర కుబేరుడైనా ఇంకేవరైనా సరే దానకి ఎవరూ అతీతం కాదు. తాజాగా ముఖేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందర్భంగా ఇలాంటి సన్నివేశమే జరిగింది. తన ముద్దుల కూతురు ఈశా అంబానీని ఆనంద్‌ పిరమల్‌కి ఇచ్చి ఈరోజు పెళ్లి జరిగింది. ఈపెళ్లి వేడుకలో ముఖేశ్‌ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ గుజరాత్‌ సంద్రాయం ప్రకారం కన్యాదానానికి సంబంధించిన కార్యక్రమాలు జరగుతు ఉంటే ఓ లేఖను చదివి వినిపించారు. కూతురిని మెట్టినింటికి పంపుతుంటే ఓ తండ్రి పడే ఆవేదనను అక్షరాల్లో కూర్చి లేఖను రాశారు. ఆ లెటర్‌ను చదువుతుంటే ముఖేశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఉద్వేగాన్ని గురైన ముఖేశ్ చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com