రికార్డు స్థాయిలో డ్రగ్స్ పట్టివేత
- December 14, 2018
బహ్రెయిన్:కంబైన్డ్ మెరైన్ ఫోర్సెస్ నిర్వహణలో వున్న హెచ్ఎంఎస్ డ్రాగన్, మరో భారీ డ్రగ్స్ సీజర్ని చేపట్టింది. టైప్ 45 డిస్ట్రాయర్ అయిన హెచ్ఎంఎస్ డ్రాగన్, అక్రమ మార్గంలో దేశంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న భారీ మొత్తంలోని డ్రగ్స్ని పట్టుకోవడం జరిగింది. 500 కిలోల డ్రగ్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 200 కిలోల హెరాయిన్, 9 కిలోల క్రిస్టల్ మెథాంఫిటమైన్ కూడా వున్నాయి. వీటి ధర స్థానికంగా 2.1 మిలియన్ డాలర్లు వుంటుందని అంచనా. ఈ ఏడాది ఇప్పటికే సిటిఎఫ్ 150, 49,255 కిలోల డ్రగ్స్ని ధ్వంసం చేయడం జరిగింది. కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ సిటిఎఫ్ 150లో భాగంగా టైప్ 45 డిస్ట్రాయర్ పెట్రోలింగ్ విధుల్ని నిర్వహిస్తోంది. కమాండర్ డారెన్ర్ గార్నియర్ ఆర్సిఎన్ నేతృత్వంలో రాయల్ కెనడియన్ నేవీ కమాండ్లో సిటిఎఫ్ బాధ్యతలు కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







