కరుణానిధి విగ్రహావిష్కరణకు హాజరుకానున్న ప్రముఖులు
- December 16, 2018
డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ ఇవాళ జరగనుంది. చెన్నైలోని డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాదురై విగ్రహంతోపాటు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటలకు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, శరద్ యాదవ్, శరద్ పవార్, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఇతర కమ్యూనిస్టు పార్టీల నేతలు, సినీ, పారిశ్రామిక ప్రముఖులకు ఆహ్వానాలందాయి. ఇక.. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ను కూడా ఆహ్వానించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







