ప్రసాదంలో విషం కలిపిన ఘటనలో.. విస్తుపోయే నిజాలు
- December 16, 2018
కర్ణాటకలో విషం కలిపిన ప్రసాదం తిని 12మంది భక్తులు మృత్యువాత పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘనటలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరే ఈ ఘోరానికి కారణమని తేలింది. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న కుటుంబ పెద్దనే ప్రసాదంలో విషం కలిసేలా చేసినట్టు సమాచారం.
ఆలయ ట్రస్ట్ అధినేత నేత చిన్నప్పి గురస్వామి అనే వ్యక్తితో గోపురం కోసం శంకుస్థాపన చేయించారు. దీనిని గురస్వామికి వరసకి తమ్ముడయ్యే దేవాంతి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆలయంపై ఆయన పెత్తనాన్ని అంగీకరించని ఆయన మహాదేశ్ అనే వ్యక్తితో కలిసి ప్రసాదంలో విషం కలిపినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో అయిదుగురికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విషం కలిపిన ప్రసాదం తిని ఇప్పటికే 12మంది మృతి చెందగా.. 40మంది అస్వస్థతకు గురై మైసూరు ఆసుపత్రిలో చేరారు. ప్రసాదం తిని ఆలయ పరిసరాల్లో 60కాకులు కూడా చనిపోవడం గమనార్హం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం కుమారస్వామి పరామర్శించారు. మృతులకు రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









