ప్రసాదంలో విషం కలిపిన ఘటనలో.. విస్తుపోయే నిజాలు
- December 16, 2018
కర్ణాటకలో విషం కలిపిన ప్రసాదం తిని 12మంది భక్తులు మృత్యువాత పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘనటలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరే ఈ ఘోరానికి కారణమని తేలింది. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న కుటుంబ పెద్దనే ప్రసాదంలో విషం కలిసేలా చేసినట్టు సమాచారం.
ఆలయ ట్రస్ట్ అధినేత నేత చిన్నప్పి గురస్వామి అనే వ్యక్తితో గోపురం కోసం శంకుస్థాపన చేయించారు. దీనిని గురస్వామికి వరసకి తమ్ముడయ్యే దేవాంతి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆలయంపై ఆయన పెత్తనాన్ని అంగీకరించని ఆయన మహాదేశ్ అనే వ్యక్తితో కలిసి ప్రసాదంలో విషం కలిపినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో అయిదుగురికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విషం కలిపిన ప్రసాదం తిని ఇప్పటికే 12మంది మృతి చెందగా.. 40మంది అస్వస్థతకు గురై మైసూరు ఆసుపత్రిలో చేరారు. ప్రసాదం తిని ఆలయ పరిసరాల్లో 60కాకులు కూడా చనిపోవడం గమనార్హం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం కుమారస్వామి పరామర్శించారు. మృతులకు రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







