కరుణానిధి విగ్రహావిష్కరణకు హాజరుకానున్న ప్రముఖులు
- December 16, 2018
డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ ఇవాళ జరగనుంది. చెన్నైలోని డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాదురై విగ్రహంతోపాటు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటలకు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, శరద్ యాదవ్, శరద్ పవార్, ఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఇతర కమ్యూనిస్టు పార్టీల నేతలు, సినీ, పారిశ్రామిక ప్రముఖులకు ఆహ్వానాలందాయి. ఇక.. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ను కూడా ఆహ్వానించారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







