తెలంగాణకు కేంద్రం శుభవార్త..
- December 18, 2018
ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. తెలంగాణ ప్రజల ఏళ్లనాటి కల నెరవేరింది. తెలంగాణకు కేంద్రం శుభవార్త తెలిపింది. సుమారు 1028 కోట్ల రూపాయల ఖర్చుతో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఏయిమ్స్ ఆసుపత్రి నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు 1264 కోట్లతో తమిళనాడు మధురైలోనూ ఏయిమ్స్ ఆసుపత్రిని నిర్మించనున్నారు.
అవంతరాలు, అభ్యంతరాలు.. అన్నింటిని మించి అలుపెరగని తెలంగాణ సర్కార్ పోరాటం ఫలించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో ఏయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
బీబీ నగర్ ఎయిమ్స్ వైద్యకళాశాలలో 100 ఎంబీబీఎస్, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 15 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సుమారు 1500 ఓపీ, వెయ్యి మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందించనున్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు 1264 కోట్లతో తమిళనాడులోని మధురైలో కూడా ఏయిమ్స్ ఏర్పాటు చేయనున్నారు. వైద్య కళాశాలలు సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!