తెలంగాణకు కేంద్రం శుభవార్త..
- December 18, 2018ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. తెలంగాణ ప్రజల ఏళ్లనాటి కల నెరవేరింది. తెలంగాణకు కేంద్రం శుభవార్త తెలిపింది. సుమారు 1028 కోట్ల రూపాయల ఖర్చుతో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ఏయిమ్స్ ఆసుపత్రి నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు 1264 కోట్లతో తమిళనాడు మధురైలోనూ ఏయిమ్స్ ఆసుపత్రిని నిర్మించనున్నారు.
అవంతరాలు, అభ్యంతరాలు.. అన్నింటిని మించి అలుపెరగని తెలంగాణ సర్కార్ పోరాటం ఫలించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో ఏయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
బీబీ నగర్ ఎయిమ్స్ వైద్యకళాశాలలో 100 ఎంబీబీఎస్, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 15 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సుమారు 1500 ఓపీ, వెయ్యి మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందించనున్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు 1264 కోట్లతో తమిళనాడులోని మధురైలో కూడా ఏయిమ్స్ ఏర్పాటు చేయనున్నారు. వైద్య కళాశాలలు సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ