పూలవనంగా మారిన కలియుగ వైకుంఠం తిరుమల
- December 19, 2018
తిరుమల:కలియుగ వైకుంఠం తిరుమల పూలవనంగా మారింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా శ్రీవారి ఆలయం రంగుల పూవులతో వెలిగిపోతోంది. సువాసనలు వెదజల్లే పుష్పాలు, పత్రాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సప్తగిరులపై వెలిసి, కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. అందుకే పర్వదినాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరిస్తుంటారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా టీటీడీ ఉద్యాన వనవిభాగం చేసిన పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మహాద్వారం నుంచి వైకుంఠ ద్వారాలకు అలంకరించిన సంప్రదాయ పుష్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. తులసీ, మరువం, దవనం పత్రాలతో రూపొందించిన 450 చిలుకలు, చెరుకు గడలు, పలు రకాల పండ్లు, పత్రాలు అబ్బుర పరిచాయి.
మహాద్వారం ముందు భాగంలో లక్ష్మీసమేత శ్రీ మహా విష్ణువు ప్రతిమ ఆలయానికి మరింత వన్నె తెచ్చింది. అలాగే మహారథ మండపం పక్కన విష్ణుమయం పేరుతో ఏర్పాటు చేసిన ఫైబర్ ప్రతిమలు భక్తులకు కనువిందు చేశాయి.
సప్తద్వారాల లోపల శ్రీరంగనాథ స్వామి, రంగనాయకి అమ్మవారు, శ్రీ మహా విష్ణువు, దశావతారల ప్రతిమలు ఆకట్టుకున్నాయి. ఇక శ్రీవారి ఆలయం, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విద్యుదీపాలంకరణలు పరవశింపచేశాయి.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







