వరుస దొంగతనాలతో అమ్వాజ్ రెసిడెంట్స్ ఆందోళన
- December 20, 2018
అమ్వాజ్ ఐలాండ్స్లో వరుస దొంగతనాలు రెసిడెంట్స్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా ఘటనలో 300 బహ్రెయినీ దినార్స్ దొంగిలించారు దొంగలు. ఓ వలసదారుడి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. తన ఇంట్లో ఏదో శబ్దం అవుతోందని గుర్తించిన బాధితుడు, లేచి చూసే సరికి.. దొంగ పారిపోతున్నట్లు గుర్తించడం జరిగింది. కంగారులో దొంగ, తన పర్సులోని డబ్బు తీసుకుని పారిపోయాడనీ, అదృష్టవశాత్తూ ఆ పర్స్ని దొంగ పారేయడంతో తాను ఊపిరి పీల్చుకున్నాననీ, అందులో విలువైన డాక్యుమెంట్స్ వున్నాయని బాధఙతుడు చెప్పారు. తెల్లవారుఝామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో ఓ మహిళ తన ఇంట్లోంచి 600 బహ్రెయినీ దినార్స్ని దొంగలు దోచుకుపోయారని ఫిర్యాదు చేశారు. కాగా, ముహరాక్ పరిధిలో నలుగురు దొంగల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ముహరాక్ గవర్నరేట్ పరిధిలో నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







