వరుస దొంగతనాలతో అమ్వాజ్ రెసిడెంట్స్ ఆందోళన
- December 20, 2018
అమ్వాజ్ ఐలాండ్స్లో వరుస దొంగతనాలు రెసిడెంట్స్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా ఘటనలో 300 బహ్రెయినీ దినార్స్ దొంగిలించారు దొంగలు. ఓ వలసదారుడి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. తన ఇంట్లో ఏదో శబ్దం అవుతోందని గుర్తించిన బాధితుడు, లేచి చూసే సరికి.. దొంగ పారిపోతున్నట్లు గుర్తించడం జరిగింది. కంగారులో దొంగ, తన పర్సులోని డబ్బు తీసుకుని పారిపోయాడనీ, అదృష్టవశాత్తూ ఆ పర్స్ని దొంగ పారేయడంతో తాను ఊపిరి పీల్చుకున్నాననీ, అందులో విలువైన డాక్యుమెంట్స్ వున్నాయని బాధఙతుడు చెప్పారు. తెల్లవారుఝామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో ఓ మహిళ తన ఇంట్లోంచి 600 బహ్రెయినీ దినార్స్ని దొంగలు దోచుకుపోయారని ఫిర్యాదు చేశారు. కాగా, ముహరాక్ పరిధిలో నలుగురు దొంగల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ముహరాక్ గవర్నరేట్ పరిధిలో నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







