ద్రాక్ష పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు..
- December 21, 2018ఈ కాలంలో ద్రాక్ష పండ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద్రాక్ష పండ్లంటే నచ్చని వారుండరు. ద్రాక్ష పండ్లలో పలురకాలున్నాయి.. నలుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో లభిస్తాయి. ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచుగా వీటిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
1. చాలామంది తరచు నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటివారు.. రాత్రివేళలో కప్పు ద్రాక్ష పండ్లు సేవిస్తే సమస్య తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
2. ద్రాక్ష పండ్లను మెత్తని పేస్ట్లా చేసుకుని అందులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే కడుపులోని మంట తగ్గుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాస్ ద్రాక్ష పండ్ల రసాన్ని సేవిస్తే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
3. ద్రాక్ష తొక్కలను బాగా ఎండబెట్టుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరచు పాలలో కలిపి తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని చెప్తున్నారు వైద్యులు.
4. ద్రాక్ష పండ్ల గుజ్జును వేరుచేసుకోవాలి. అందులో స్పూన్ మోతాదులో కొద్దిగా తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై గల నల్లటి ఛారలు, వలయాలు పోతాయి. దాంతో ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది.
5. ద్రాక్ష పండ్లలోని విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తాయి. ద్రాక్ష పండ్లను ప్రతిరోజూ సలాడ్ రూపంలో ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..