మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలుశిక్ష

- December 24, 2018 , by Maagulf
మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలుశిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌ కు అవినీతి నిరోధక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఆయనను దోషిగా తేల్చింది కోర్టు. శిక్షతోపాటు 1.5 బిలియన్ డాలర్ల జరిమానాను కూడా విధించింది. కాగా అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో గతంలోనే నవాజ్ షరీఫ్‌ పై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి గత బుధవారం కొన్ని కీలక డాక్యుమెంట్లను సమర్పించేందుకు షరీఫ్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. ఇందు కోసం కనీసం వారం నుంచి పది రోజుల గడువు కావలసిందిగా న్యాయవాది కోర్టును కోరారు. న్యాయవాది అభ్యర్థననను కోర్టు తోసిపుచ్చింది. ఇవాళ నవాజ్ షరీఫ్‌ కు శిక్ష ఖరారు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com