మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలుశిక్ష
- December 24, 2018పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కు అవినీతి నిరోధక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఆయనను దోషిగా తేల్చింది కోర్టు. శిక్షతోపాటు 1.5 బిలియన్ డాలర్ల జరిమానాను కూడా విధించింది. కాగా అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో గతంలోనే నవాజ్ షరీఫ్ పై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి గత బుధవారం కొన్ని కీలక డాక్యుమెంట్లను సమర్పించేందుకు షరీఫ్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. ఇందు కోసం కనీసం వారం నుంచి పది రోజుల గడువు కావలసిందిగా న్యాయవాది కోర్టును కోరారు. న్యాయవాది అభ్యర్థననను కోర్టు తోసిపుచ్చింది. ఇవాళ నవాజ్ షరీఫ్ కు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..