ఒమన్ చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్
- December 27, 2018
మస్కట్: ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ఐసిజిఎస్) విక్రమ్, మస్కట్ చేరుకుంది. మూడు రోజుల గుడ్ విల్ విజిట్లో భాగంగా విక్రమ్, ఒమన్ చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సుల్తానేట్లో ఇండియా అంబాసిడర్ మును మహావర్, ఐసిజిఎస్ విక్రమ్పై రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మెరిటైమ్ సెక్యూరిటీ విషయంలో భారత్ అన్ని విధాలా ఒమన్కి సహకరిస్తుందని ఇండియన్ ఎంబసీ ఈ సందర్భంగా పేర్కొంది. ఇండియన్ కోస్ట్ గార్డ్, అలాగే రాయల్ ఒమన్ పోలీస్ కోస్ట్ గార్డ్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడ్తుందని అధికారులు పేర్కొన్నారు. ఐసిజిఎస్ విక్రమ్, 98 మీటర్స్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెస్సెల్ సిరీస్లో భాగం. ఇటీవలే దీన్ని కమిషన్ చేశారు. మొత్తంగా ఈ వెస్సెల్లో 100 మంది పనిచేస్తారు. రాజ్ కమల్ సిన్హా కమాండెంట్గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..
- ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్స్కీ...
- భారత్ పై రెండో వన్డేలో విజయం..
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..







