ఒమన్ చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్
- December 27, 2018
మస్కట్: ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ఐసిజిఎస్) విక్రమ్, మస్కట్ చేరుకుంది. మూడు రోజుల గుడ్ విల్ విజిట్లో భాగంగా విక్రమ్, ఒమన్ చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సుల్తానేట్లో ఇండియా అంబాసిడర్ మును మహావర్, ఐసిజిఎస్ విక్రమ్పై రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మెరిటైమ్ సెక్యూరిటీ విషయంలో భారత్ అన్ని విధాలా ఒమన్కి సహకరిస్తుందని ఇండియన్ ఎంబసీ ఈ సందర్భంగా పేర్కొంది. ఇండియన్ కోస్ట్ గార్డ్, అలాగే రాయల్ ఒమన్ పోలీస్ కోస్ట్ గార్డ్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడ్తుందని అధికారులు పేర్కొన్నారు. ఐసిజిఎస్ విక్రమ్, 98 మీటర్స్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెస్సెల్ సిరీస్లో భాగం. ఇటీవలే దీన్ని కమిషన్ చేశారు. మొత్తంగా ఈ వెస్సెల్లో 100 మంది పనిచేస్తారు. రాజ్ కమల్ సిన్హా కమాండెంట్గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







