ఒమన్‌ చేరుకున్న ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ షిప్‌

- December 27, 2018 , by Maagulf
ఒమన్‌ చేరుకున్న ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ షిప్‌

మస్కట్‌: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ షిప్‌ (ఐసిజిఎస్‌) విక్రమ్‌, మస్కట్‌ చేరుకుంది. మూడు రోజుల గుడ్‌ విల్‌ విజిట్‌లో భాగంగా విక్రమ్‌, ఒమన్‌ చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సుల్తానేట్‌లో ఇండియా అంబాసిడర్‌ మును మహావర్‌, ఐసిజిఎస్‌ విక్రమ్‌పై రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. మెరిటైమ్‌ సెక్యూరిటీ విషయంలో భారత్‌ అన్ని విధాలా ఒమన్‌కి సహకరిస్తుందని ఇండియన్‌ ఎంబసీ ఈ సందర్భంగా పేర్కొంది. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, అలాగే రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ కోస్ట్‌ గార్డ్‌ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడ్తుందని అధికారులు పేర్కొన్నారు. ఐసిజిఎస్‌ విక్రమ్‌, 98 మీటర్స్‌ ఆఫ్‌ షోర్‌ పెట్రోల్‌ వెస్సెల్‌ సిరీస్‌లో భాగం. ఇటీవలే దీన్ని కమిషన్‌ చేశారు. మొత్తంగా ఈ వెస్సెల్‌లో 100 మంది పనిచేస్తారు. రాజ్‌ కమల్‌ సిన్హా కమాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com