ఫేక్ కాప్ దోపిడీ: బాధితుడు ఇండియన్
- December 28, 2018
కువైట్ సిటీ: ఓ వ్యక్తి సీఐడీ అధికారిగా చెప్పుకుని దోపిడీకి పాల్పడినట్లు భారత వలసదారుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోర్ వీల్ డ్రైవ్ వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి, తన ఐడీ కార్డుని చూపించమన్నారనీ, ఆ సమయంలో తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నానని చెప్పారు. తాను ఐడీ చూపించగా, దాన్ని లాక్కున్న అధికారి రూపంలోని వ్యక్తి, తనవద్దనున్న 380 కువైటీ దినార్స్ దోచుకుని పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితుడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదయ్యింది. నిందితుడి కోసం అన్వేషిస్తున్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







