అయ్యో! 15 మంది సజీవ సమాధి అయినట్టేనా?
- December 28, 2018మేఘాలయలోని బొగ్గుగనిలో చిక్కుకున్న 15మంది సజీవ సమాధి అయినట్లేనని షిల్లాంగ్ కాంగ్రెస్ ఎంపి విన్సెంట్ హెచ్ పాలా తెలిపారు. ఈస్ట్ జంతియా జిల్లాలో డిసెంబర్ 15న ఓ అక్రమ మైనింగ్ గనుల్లో వీరంతా చిక్కుకున్నారు. మైనర్లను రక్షించేందుకు గువాహటిలోని ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఆపరేషన్ చేపట్టింది. గనిలో నీటిని తోడితే తప్ప మైనర్లను వెలికి తీయడం కష్టతరమైంది. నీటిని పంపింగ్ చేసేందుకు మోటార్లు ఉపయోగించింది. చిక్కుకున్న వారిని వెలుపలకి తెచ్చేందుకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు మరిన్ని పంపులు కావాలని ఉన్నతాధికారులు మొర పెట్టుకున్నా ఇప్పటికి మోటార్లు సంఘటనా స్థలానికి చేరుకోలేదు. అయితే ఘటన జరిగి 15రోజులు కావస్తున్నందున బతికి బట్టకట్టడం అసాధ్యమని, ఇప్పటికే ఆ ప్రాంతంలో దుర్గందం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. అయితే మొత్తం ఘటన జరిగిన తీరుపై షిల్లాంగ్ ఎంపి విన్సెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సకాలంలో కేంద్రం స్పందించే ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేదని కాదన్నారు . ఇప్పటికైనా కేంద్రం సీరియస్ గా తీసుకుని మోటార్లతో నీరు తోడి మైనర్ల దేహాలను వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం