విశాఖ లో ఎయిర్ షో రద్దు
- December 28, 2018
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. 'విశాఖ ఉత్సవ్' పేరుతో ప్రతీ ఏటా ఏపీ ప్రభుత్వం సంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలను చేపట్టేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. క్రీడలు, జానపద నృత్యాలు, ఇతర కార్యక్రమాలతో అలరించనున్న ఈ వేడుకలకు తాజాగా కేంద్రం షాక్ ఇచ్చింది. విశాఖ ఉత్సవ్లో ఎయిర్ షోను రద్దు చేసింది కేంద్రం. ఇందులో పాల్గొనాల్సిన 90 మంది వాయుసేన సిబ్బందిని వెనక్కు రావాలని ఆదేశించింది. దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనీ, రిహార్సల్స్ పూర్తి చేశాక సిబ్బందిని వెనక్కు పిలిపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఏర్పాట్లు పూర్తి కాకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ విషయంలో ఏపీ సర్కార్ ఆలస్యంగా స్పందించిందని అంటున్నారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







