విశాఖ లో ఎయిర్ షో రద్దు
- December 28, 2018
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. 'విశాఖ ఉత్సవ్' పేరుతో ప్రతీ ఏటా ఏపీ ప్రభుత్వం సంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలను చేపట్టేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. క్రీడలు, జానపద నృత్యాలు, ఇతర కార్యక్రమాలతో అలరించనున్న ఈ వేడుకలకు తాజాగా కేంద్రం షాక్ ఇచ్చింది. విశాఖ ఉత్సవ్లో ఎయిర్ షోను రద్దు చేసింది కేంద్రం. ఇందులో పాల్గొనాల్సిన 90 మంది వాయుసేన సిబ్బందిని వెనక్కు రావాలని ఆదేశించింది. దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనీ, రిహార్సల్స్ పూర్తి చేశాక సిబ్బందిని వెనక్కు పిలిపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఏర్పాట్లు పూర్తి కాకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ విషయంలో ఏపీ సర్కార్ ఆలస్యంగా స్పందించిందని అంటున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







