విశాఖ లో ఎయిర్ షో రద్దు

- December 28, 2018 , by Maagulf
విశాఖ లో ఎయిర్ షో రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. 'విశాఖ ఉత్సవ్' పేరుతో ప్రతీ ఏటా ఏపీ ప్రభుత్వం సంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలను చేపట్టేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. క్రీడలు, జానపద నృత్యాలు, ఇతర కార్యక్రమాలతో అలరించనున్న ఈ వేడుకలకు తాజాగా కేంద్రం షాక్ ఇచ్చింది. విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షోను రద్దు చేసింది కేంద్రం. ఇందులో పాల్గొనాల్సిన 90 మంది వాయుసేన సిబ్బందిని వెనక్కు రావాలని ఆదేశించింది. దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనీ, రిహార్సల్స్ పూర్తి చేశాక సిబ్బందిని వెనక్కు పిలిపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఏర్పాట్లు పూర్తి కాకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ విషయంలో ఏపీ సర్కార్ ఆలస్యంగా స్పందించిందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com