అమల్లోకి వచ్చిన సీపీ టిపిపి వాణిజ్య ఒప్పందం
- December 31, 2018
టోక్యో : అమెరికాను దూరంగా పెట్టి పదకొండు దేశాలు కలసి కుదుర్చుకున్న తాజా ట్రాన్స్ పసిఫిక్ వాణిజ్య ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదవ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 దేశాలు కలసి గత మార్చిలో ఈ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ట్రాన్స్ పసిఫిక్ ఏరియాలో సభ్య దేశాలు తమ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం సాగించేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. కీలక రంగాలకు సంబంధించిన 95 రకాల వస్తువుల దిగుమతులపై సుంకాలను పూర్తిగా తొలగిస్తారు. వరి, బీఫ్ వంటి వాటిపై కొంత నియంత్రణ ఉంటుంది. అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక చర్యలు (ప్రొటెక్షనిజం), చైనాపై అది సాగిస్తున్న వాణిజ్య యుద్ధం దరిమిలా ఆసియా పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, మెక్సికో, న్యూజిలాండ్ సింగపూర్ మొదట ఈ ఒప్పందానికి ఆమోదం తెలపగా, తరువాత వియత్నాం మరి కొన్ని దేశాలు ఇందులో వచ్చి చేరాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







