శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు
- January 02, 2019
తిరువనంతపురం: కేరళలో సమానత్వం కోసం మానవ హారం చేపట్టి విజయాన్ని సొంతం చేసుకున్న మహిళలు మరో గెలుపుకు నాంది పలికారు. కేరళలో శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు ప్రవేశించడం ద్వారా వారు చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారు జామున శబరిమలను సందర్శించారు. గత నెలలో వీరిద్దరూ శబరిమల సందర్శించడానికి రాగా, నిరసనల వెలువెత్తడంతో వెనుదిరిగారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీపరిచాయి. గత అర్థరాత్రి నుండి ఆలయ ప్రవేశానికి సమాయత్తమయ్యారు. తెల్లవారు జామున అయ్యప్ప గర్భగుడిలోకి చేరి పూజలు చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







