శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు
- January 02, 2019తిరువనంతపురం: కేరళలో సమానత్వం కోసం మానవ హారం చేపట్టి విజయాన్ని సొంతం చేసుకున్న మహిళలు మరో గెలుపుకు నాంది పలికారు. కేరళలో శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు ప్రవేశించడం ద్వారా వారు చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారు జామున శబరిమలను సందర్శించారు. గత నెలలో వీరిద్దరూ శబరిమల సందర్శించడానికి రాగా, నిరసనల వెలువెత్తడంతో వెనుదిరిగారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీపరిచాయి. గత అర్థరాత్రి నుండి ఆలయ ప్రవేశానికి సమాయత్తమయ్యారు. తెల్లవారు జామున అయ్యప్ప గర్భగుడిలోకి చేరి పూజలు చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు