శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు

- January 02, 2019 , by Maagulf
శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు

తిరువనంతపురం: కేరళలో సమానత్వం కోసం మానవ హారం చేపట్టి విజయాన్ని సొంతం చేసుకున్న మహిళలు మరో గెలుపుకు నాంది పలికారు. కేరళలో శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు ప్రవేశించడం ద్వారా వారు చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారు జామున శబరిమలను సందర్శించారు. గత నెలలో వీరిద్దరూ శబరిమల సందర్శించడానికి రాగా, నిరసనల వెలువెత్తడంతో వెనుదిరిగారు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీపరిచాయి. గత అర్థరాత్రి నుండి ఆలయ ప్రవేశానికి సమాయత్తమయ్యారు. తెల్లవారు జామున అయ్యప్ప గర్భగుడిలోకి చేరి పూజలు చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com