ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
- January 02, 2019'బాహుబలి' తర్వాత ప్రభాస్.. ఆ రేంజ్ సినిమాలే ప్లాన్ చేసుకొంటున్నారు. దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ తో 'సాహో' తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని బాహుబలి రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇక, రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రం కూడా భారీ బడ్జెట్ సినిమాయే. ఈ సినిమాని బాహుబలి రేంజ్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత కూడా ప్రభాస్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమాని తీసుకొచ్చే ప్రయత్నంలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. ఇటీవల ప్రశాంత్ నీల్ వెళ్లి ప్రభాస్ తో ఓ క్యాజువల్ భేటీ వేశారు. దానివెనుక దిల్ రాజు వున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ కనుక మాంచి సబ్జెక్ట్ తో ప్రభాస్ ను ఒప్పించగలిగితే, ఎంతయినా పెట్టి ప్రొడక్షన్ చేసేందుకు దిల్ రాజు సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ప్రభాస్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా రావడం ఖాయం.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు