ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
- January 02, 2019
'బాహుబలి' తర్వాత ప్రభాస్.. ఆ రేంజ్ సినిమాలే ప్లాన్ చేసుకొంటున్నారు. దాదాపు రూ. 200కోట్ల భారీ బడ్జెట్ తో 'సాహో' తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని బాహుబలి రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇక, రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రం కూడా భారీ బడ్జెట్ సినిమాయే. ఈ సినిమాని బాహుబలి రేంజ్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత కూడా ప్రభాస్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమాని తీసుకొచ్చే ప్రయత్నంలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. ఇటీవల ప్రశాంత్ నీల్ వెళ్లి ప్రభాస్ తో ఓ క్యాజువల్ భేటీ వేశారు. దానివెనుక దిల్ రాజు వున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ కనుక మాంచి సబ్జెక్ట్ తో ప్రభాస్ ను ఒప్పించగలిగితే, ఎంతయినా పెట్టి ప్రొడక్షన్ చేసేందుకు దిల్ రాజు సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ప్రభాస్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా రావడం ఖాయం.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







