టోక్యోలో నూతన సంవత్సర వేడుకలపై దాడి..8 మందికి గాయాలు
- January 02, 2019
టోక్యో: జపాన్లో నూతన సంవత్సర ప్రారంభ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి టోక్యోలో వేడులకు జరపుకుతుంటున్న వారిపైకి కౌజిరలో కుసాకబె అనే 21 ఏళ్ల యువకుడు వేగంగా కారు పోనివ్వడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మొదట్లో దీనిని ఉగ్రవాద చర్యగా భావించి, నగరంలో ప్రవేశించే దారులన్నిటినీ మూసివేశారు. ఓ మత ఛాందస వాదికి ఉరి శిక్ష విధించడానికి నిరసనగా ఆ మతఛాందసవాద సంస్థకు చెందిన సభ్యులు ఈ ప్రతీకారానికి పాల్పడినట్లు పోలీసులు తరువాత నిర్ధారించారు. 1995లో టోక్యో సబ్వేలో శరీన్ విషయవాయు ప్రయోగం కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో కొందరికి గత ఏడాది ఉరి శిక్ష విధించారు. దీనికి ప్రతిగా ఈ కారు దాడికి దిగిన కుసాకబే పై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!