టోక్యోలో నూతన సంవత్సర వేడుకలపై దాడి..8 మందికి గాయాలు
- January 02, 2019
టోక్యో: జపాన్లో నూతన సంవత్సర ప్రారంభ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి టోక్యోలో వేడులకు జరపుకుతుంటున్న వారిపైకి కౌజిరలో కుసాకబె అనే 21 ఏళ్ల యువకుడు వేగంగా కారు పోనివ్వడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మొదట్లో దీనిని ఉగ్రవాద చర్యగా భావించి, నగరంలో ప్రవేశించే దారులన్నిటినీ మూసివేశారు. ఓ మత ఛాందస వాదికి ఉరి శిక్ష విధించడానికి నిరసనగా ఆ మతఛాందసవాద సంస్థకు చెందిన సభ్యులు ఈ ప్రతీకారానికి పాల్పడినట్లు పోలీసులు తరువాత నిర్ధారించారు. 1995లో టోక్యో సబ్వేలో శరీన్ విషయవాయు ప్రయోగం కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో కొందరికి గత ఏడాది ఉరి శిక్ష విధించారు. దీనికి ప్రతిగా ఈ కారు దాడికి దిగిన కుసాకబే పై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







