బ్రిడ్జిపై రైలు ప్రమాదం
- January 02, 2019
డెన్మార్క్ లో ఈ ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 8 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. ది గ్రేట్ బెల్ట్ బ్రిడ్జిపై జరిగిన రైలు ప్రమాదంలో పలువురు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మరో ఎనిమిది మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. అధికారిక ప్రకటన మేరకు మృతుల సంఖ్య ఆరుగా చెబుతున్నారు. కానీ అనధికారిక కథనాల మేరకు ఈ సంఖ్య పదికి పైనే ఉండొచ్చని తెలిసింది. ది గ్రేట్ బెల్ట్ బ్రిడ్జి మధ్య డానిష్ దీవులైన జీల్యాండ్, ఫునెన్ లను కలుపుతుంది. డానిష్ మీడియా కథనం ప్రకారం బలంగా వీస్తున్న చలిగాలుల కారణంగా ఓ గూడ్సు రైలుపై టార్పాలిన్ విడిపోయి అందులోని కంటెయినర్లు ఎగురుతూ ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలుపై వచ్చిపడ్డాయి. దీంతో దారి కనపడక హఠాత్తుగా ఆపేయాల్సి వచ్చింది. దీంతో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







