బ్రిడ్జిపై రైలు ప్రమాదం
- January 02, 2019
డెన్మార్క్ లో ఈ ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 8 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. ది గ్రేట్ బెల్ట్ బ్రిడ్జిపై జరిగిన రైలు ప్రమాదంలో పలువురు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మరో ఎనిమిది మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. అధికారిక ప్రకటన మేరకు మృతుల సంఖ్య ఆరుగా చెబుతున్నారు. కానీ అనధికారిక కథనాల మేరకు ఈ సంఖ్య పదికి పైనే ఉండొచ్చని తెలిసింది. ది గ్రేట్ బెల్ట్ బ్రిడ్జి మధ్య డానిష్ దీవులైన జీల్యాండ్, ఫునెన్ లను కలుపుతుంది. డానిష్ మీడియా కథనం ప్రకారం బలంగా వీస్తున్న చలిగాలుల కారణంగా ఓ గూడ్సు రైలుపై టార్పాలిన్ విడిపోయి అందులోని కంటెయినర్లు ఎగురుతూ ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలుపై వచ్చిపడ్డాయి. దీంతో దారి కనపడక హఠాత్తుగా ఆపేయాల్సి వచ్చింది. దీంతో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు
తాజా వార్తలు
- భారత్ పై రెండో వన్డేలో విజయం..
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..
- జర్మనీలో ఉద్యోగాలకు టామ్కామ్ నోటిఫికేషన్..
- డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి..







