15 మిలియన్ దిర్హామ్ల లాటరీ: ప్రాంక్ కాల్ అనుకున్నానంటోన్న ఇండియన్
- January 03, 201915 మిలియన్ దిర్హామ్ల లాటరీని బిగ్ టికెట్ రఫాలె డ్రాలో గెల్చుకున్న ఇండియన్, తాను ఇంకా ఈ వాస్తవాన్ని నిజమని నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. శరత్ పురుషోత్తమన్ అనే భారత వలసదారుడు, బిగ్ టికెట్ రఫాలె డ్రాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద మొత్తమైన 15 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న సంగతి తెల్సిందే. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో ఈ డ్రా నిర్వహించారు. విజేతకు పలుమార్లు ఫోన్ చేశామనీ, అయితే అది నిజమని ఆయన తొలుత నమ్మలేదని బిగ్ టికెట్ అబుదాబీ డ్యూటీ ఫ్రీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షెరిల్ ఫజార్డో చెప్పారు. 083733 నెంబర్ టిక్కెట్పై ఈ బహుమతి పురుషోత్తమన్ని వరించింది. గెలిచిన విషయాన్ని తెలియజేయడం జరిగిందనీ, అయితే అది నిజమని ఒప్పించడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందని నిర్వాహకులు అన్నారు. కాగా, రెండో ప్రైజ్ 100,000 దిర్హామ్లు కూడా భారతదేశానికి చెందిన వ్యక్తి జినాచంద్రన్ వజూర్ నారాయణన్ గెల్చుకోవడం గమనార్హం. పాకిస్తాన్కి చెందిన షాహిద్ ఫరీద్ మూడో బహుమతి గెలుచుకున్నారు. మొత్తంగా ఈ డ్రాలో 8 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..