15 మిలియన్ దిర్హామ్ల విజేతలు ఈ బెస్ట్ ఫ్రెండ్స్
- January 04, 2019యూ.ఏ.ఈ:ఇద్దరు స్నేహితులు.. కొత్త ఏడాదిలో అత్యద్భుతమైన బహుమతిని గెల్చుకున్నారు. ఈ ఆనంద క్షణాల్ని పంచుకుంటూ జీవితంలో ఎన్నో కష్ట సుఖాల్ని కలిసే ఎదుర్కొన్నామనీ, ఇప్పుడు ఈ బహుమతిని తాము పంచుకుంటున్నందుకు ఆనందంగా వుందని చెప్పారు. 34 ఏళ్ళ శరత్ పురుషోత్తమన్, 36 ఏళ్ళ ప్రశాంత్ సురేంద్రన్.. కేరళకు చెందినవారు. ఇద్దరూ ఒకే సంస్థలో పనిచేస్తున్నారు. దుబాయ్లో ఈ ఇద్దరూ ఒకే రూమ్లో వున్నారు. కష్ట సుఖాల్లో ఇద్దరం కలిసే వున్నామనీ, ఒకరి అవసరాల్ని ఇంకొకరు తీర్చేందుకు కష్టపడ్డామని చెప్పారు. శరత్ పురుషోత్తమన్ పేరు మీద టిక్కెట్కి బహుమతి లభించింది. మొత్తం 15 మిలియన్ దిర్హామ్ల బహుమతి శరత్ని వరించింది. బహుమతి గెల్చుకున్న ఆనందంలో తన తల్లిని చూడాలని వుందంటున్నారు శరత్. మరోపక్క తన కుమార్తె తనకు లక్ అని ప్రశాంత్ అంటున్నారు. ఈ ఆనంద క్షణాల్లో తమ కుటుంబాలతో వుండాలని కోరుకుంటున్నామనీ, ఆ తర్వాతే ఈ బహుమతిని ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెబుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ