ఆస్థి కోసం కుటుంబ సభ్యులపై దాడి.!
- January 05, 2019
ఆస్థి కోసం కుటుంబ సభ్యులపై దాడి చేశాడు ఓ ఎమిరేటీ వ్యక్తి. 45 ఏళ్ల నిందితుడు తన 28 ఏళ్ల సోదరున్ని కత్తితో పొడిచాడు. తమ తండ్రికి చెందిన ఆస్థి విషయంలో కుటుంబంలో తలెత్తిన తగాదాలే ఈ దాడికి కారణం. బర్షాలో నిందితుడి తండ్రికి ఓ ఇల్లు ఉంది. ఇటీవల తండ్రి మృతి చెందాడు. దాంతో ఆ ఇంటి కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అక్టోబర్లో పంపకాల కోసం కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిందితుడు తీవ్ర ఆగ్రహానికి లోనై సోదరునిపై దాడి చేశాడు. కత్తితో దాడి చేసేందుకు తమ సోదరుడు ప్రయత్నించినా, అడ్డుకునేందుకు తాము కష్టపడాల్సి వచ్చిందనీ, అయితే తన మీద కత్తితో సోదరుడు దాడి చేశాడనీ బాధితుడు కోర్టుకు తెలిపాడు. దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కేసును విచారిస్తోంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







