ఆస్థి కోసం కుటుంబ సభ్యులపై దాడి.!
- January 05, 2019
ఆస్థి కోసం కుటుంబ సభ్యులపై దాడి చేశాడు ఓ ఎమిరేటీ వ్యక్తి. 45 ఏళ్ల నిందితుడు తన 28 ఏళ్ల సోదరున్ని కత్తితో పొడిచాడు. తమ తండ్రికి చెందిన ఆస్థి విషయంలో కుటుంబంలో తలెత్తిన తగాదాలే ఈ దాడికి కారణం. బర్షాలో నిందితుడి తండ్రికి ఓ ఇల్లు ఉంది. ఇటీవల తండ్రి మృతి చెందాడు. దాంతో ఆ ఇంటి కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అక్టోబర్లో పంపకాల కోసం కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిందితుడు తీవ్ర ఆగ్రహానికి లోనై సోదరునిపై దాడి చేశాడు. కత్తితో దాడి చేసేందుకు తమ సోదరుడు ప్రయత్నించినా, అడ్డుకునేందుకు తాము కష్టపడాల్సి వచ్చిందనీ, అయితే తన మీద కత్తితో సోదరుడు దాడి చేశాడనీ బాధితుడు కోర్టుకు తెలిపాడు. దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కేసును విచారిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







