ఆస్థి కోసం కుటుంబ సభ్యులపై దాడి.!
- January 05, 2019ఆస్థి కోసం కుటుంబ సభ్యులపై దాడి చేశాడు ఓ ఎమిరేటీ వ్యక్తి. 45 ఏళ్ల నిందితుడు తన 28 ఏళ్ల సోదరున్ని కత్తితో పొడిచాడు. తమ తండ్రికి చెందిన ఆస్థి విషయంలో కుటుంబంలో తలెత్తిన తగాదాలే ఈ దాడికి కారణం. బర్షాలో నిందితుడి తండ్రికి ఓ ఇల్లు ఉంది. ఇటీవల తండ్రి మృతి చెందాడు. దాంతో ఆ ఇంటి కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అక్టోబర్లో పంపకాల కోసం కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిందితుడు తీవ్ర ఆగ్రహానికి లోనై సోదరునిపై దాడి చేశాడు. కత్తితో దాడి చేసేందుకు తమ సోదరుడు ప్రయత్నించినా, అడ్డుకునేందుకు తాము కష్టపడాల్సి వచ్చిందనీ, అయితే తన మీద కత్తితో సోదరుడు దాడి చేశాడనీ బాధితుడు కోర్టుకు తెలిపాడు. దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కేసును విచారిస్తోంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..