ఆల్ ఇండియా రేడియో మూసివేత
- January 05, 2019కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రసార భారతి కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా రేడియో జాతీయ ఛానల్ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు జాతీయవార్తలు, కీలక విషయాలు వెల్లడించే ఆల్ ఇండియా రేడియో నేషనల్ ఛానల్ 1987లో ప్రారంభమైంది.
సరైన ఆదరణ లేకపోవడం ఛానల్ మూసివేతకు ఓ కారణం. ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్టు ప్రసార భారతి చెబుతోంది. అహమ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, షిల్లాంగ్, తిరువనంతపురంలోని ప్రాంతీయ శిక్షణా అకాడెమీలను కూడా రద్దు చేయనున్నారు.
జాతీయ ఛానల్కు సంబంధించిన ట్రాన్స్మీటర్లు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. వీటితో ప్రస్తుతమున్న డిజిటల్ ప్రపంచంలో నెట్టుకురావడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ప్రేక్షకాదరణ కూడా పెద్దగా లేని ఛానళ్లపై డబ్బులు ఖర్చు చేయడం కూడా సరైనది కాదని భావించే మూసివేత నిర్ణయం తీసుకున్నట్టు ప్రసార భారతి అధికారులు చెబుతున్నారు.
ఇక్కడ పనిచేసిన సిబ్బందిని ఇతర చోట్లకు సర్దుబాటు చేయనున్నారు. ఇప్పటికే ఆల్ ఇండియా రేడియో కార్యక్రమాలను అవుట్ సోర్సింగ్ పద్దతితో నిర్వహిస్తున్నారు. వాళ్ళ వైబ్సైట్ ను కూడా ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







