అదుపుతప్పి లోయలో పడ్డ స్కూల్ బస్సు...7మంది మృతి
- January 05, 2019
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం విద్యార్థులను స్కూల్కు తరలిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో పాటు బస్సు డ్రైవర్ కూడా మృతిచెందాడు.
ఈ ఘోర ప్రమాదం సిర్మార్ జిల్లాలో జరిగింది. సంగ్రాహ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను స్కూల్కు తీసుకువెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాద సమయంలో మొత్తం 18 మంది విద్యార్థులు బస్సులో వున్నారు.
ఈ ప్రమాదంలో మరో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో చిన్నారులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంత మంది పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాగా ఎత్తులోంచి పడటంతో బస్సు తుక్కుతుక్కు అయ్యిందని... అందులో ఇరుక్కున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగి వుంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత మిగతా వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







