అదుపుతప్పి లోయలో పడ్డ స్కూల్ బస్సు...7మంది మృతి
- January 05, 2019హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం విద్యార్థులను స్కూల్కు తరలిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో పాటు బస్సు డ్రైవర్ కూడా మృతిచెందాడు.
ఈ ఘోర ప్రమాదం సిర్మార్ జిల్లాలో జరిగింది. సంగ్రాహ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను స్కూల్కు తీసుకువెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాద సమయంలో మొత్తం 18 మంది విద్యార్థులు బస్సులో వున్నారు.
ఈ ప్రమాదంలో మరో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో చిన్నారులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంత మంది పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాగా ఎత్తులోంచి పడటంతో బస్సు తుక్కుతుక్కు అయ్యిందని... అందులో ఇరుక్కున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగి వుంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత మిగతా వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..