స్కామ్ అలర్ట్: 500 ఎమిరేట్స్ ఫ్రీ టిక్కెట్స్ బోగస్
- January 05, 2019
యూఏఈ రెసిడెంట్స్, 500 ఎమిరేట్స్ ప్రీ టిక్కెట్స్ స్కామ్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఎమిరేట్స్ సంస్థ హెచ్చరించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఎమిరేట్స్ సంస్థ 500 ఉచిత ఎయిర్ టిక్కెట్స్ అందిస్తోందంటూ ఓ తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయమై ఎమిరేట్స్ సంస్థ స్పందించింది. ఇలాంటి మెసేజ్లనూ ఎవరూ నమ్మి మోసపోవద్దని పేర్కొంది. ఎమిరేట్స్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, ఎమిరేట్స్ సంస్థ ఎలాంటి ఆఫర్స్ ప్రకటించినా అవన్నీ అధికారిక ప్లాట్ ఫామ్స్ మీదనే జరుగుతాయని పేర్కొన్నారు. వాట్సాప్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై కొందరు ఈ తరహా మెసేజ్లను ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. 2017 సెప్టెంబర్లో ఓ ఫేక్ వెబ్ సైట్, ఓ సర్వే నిర్వహించి రెండు ఉచిత ఎయిర్ టిక్కెట్స్ని అందిస్తున్నట్లుగా పేర్కొని చాలామందిని మోసం చేసింది. అప్పుడూ ఎమిరేట్స్ సంస్థ తమ వినియోగదారుల్ని, పౌరుల్ని అలర్ట్ చేసింది. ఇలాంటి ఫేక్ విషయాల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, బ్యాంక్ అకౌంట్ వివరాల్ని ఎవరికీ తెలియజేయరాదని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







