స్కామ్ అలర్ట్: 500 ఎమిరేట్స్ ఫ్రీ టిక్కెట్స్ బోగస్
- January 05, 2019యూఏఈ రెసిడెంట్స్, 500 ఎమిరేట్స్ ప్రీ టిక్కెట్స్ స్కామ్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఎమిరేట్స్ సంస్థ హెచ్చరించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఎమిరేట్స్ సంస్థ 500 ఉచిత ఎయిర్ టిక్కెట్స్ అందిస్తోందంటూ ఓ తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయమై ఎమిరేట్స్ సంస్థ స్పందించింది. ఇలాంటి మెసేజ్లనూ ఎవరూ నమ్మి మోసపోవద్దని పేర్కొంది. ఎమిరేట్స్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, ఎమిరేట్స్ సంస్థ ఎలాంటి ఆఫర్స్ ప్రకటించినా అవన్నీ అధికారిక ప్లాట్ ఫామ్స్ మీదనే జరుగుతాయని పేర్కొన్నారు. వాట్సాప్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై కొందరు ఈ తరహా మెసేజ్లను ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. 2017 సెప్టెంబర్లో ఓ ఫేక్ వెబ్ సైట్, ఓ సర్వే నిర్వహించి రెండు ఉచిత ఎయిర్ టిక్కెట్స్ని అందిస్తున్నట్లుగా పేర్కొని చాలామందిని మోసం చేసింది. అప్పుడూ ఎమిరేట్స్ సంస్థ తమ వినియోగదారుల్ని, పౌరుల్ని అలర్ట్ చేసింది. ఇలాంటి ఫేక్ విషయాల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, బ్యాంక్ అకౌంట్ వివరాల్ని ఎవరికీ తెలియజేయరాదని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!