రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలు 109,721
- January 09, 2019కువైట్ సిటీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ వెల్లడించిన తాజా గణాంకాల్ని బట్టి చూస్తే, జనవరి నాటికి మొత్తం రెసిడెన్సీ వయొలేటర్స్ సంఖ్య 109,721గా కన్పిస్తోంది. ఇందులో 61,506 మంది పురుషులు, 48,215 మంది మహిళలు వున్నారు. ఆర్టికల్ 20 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య 48,965 కాగా, ఆర్టికల్ 18 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడినవారి సంఖ్య 29,426గా వుంది. ఆర్టికల్ 14 (టెంపరరీ రెసిడెన్స్) ఉల్లంఘనకు పాల్పడినవారి సంఖ్య 22,401గా తెలుస్తోంది. ఆర్టికల్ 22 ఉల్లంఘనకు పాల్పడినవారి సంఖ్య 7,387. ఆర్టికల్ 17 ఉల్లంఘనకు 1091 మంది పాల్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆర్టికల్ ఇది. సెక్యూరిటీ క్యాంపెయిన్స్ మరియు చెక్ పాయింట్స్ ద్వారా ఉల్లంఘనుల్ని గుర్తించి అరెస్ట్ చేస్తామనీ, వారిని డిపోర్ట్ చేస్తామనిమినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ - రెసిడెన్సీ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి చెప్పారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం