కటారాలో ఈక్వైన్ ఎగ్జిబిషన్
- January 09, 2019దోహా:40 వరకూ స్టన్నింగ్ ఫొటోగ్రాఫ్స్ కటారా బిల్డింగ్ 18లో కొలువుదీరాయి. 'అల్ అదియత్' ఎగ్జిబిషన్ పేరుతో గుర్రాలకు సంబంధించిన అందమైన ఫొటోల్ని ఇక్కడ ప్రదర్శనకు వుంచారు. కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీమ్ అల్ సులైటి, ఈ ఫొటో ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. ఖతారీ ఫొటోగ్రాఫర్ ఒమర్ అల్ హమ్మాది కెమెరా నుంచి వచ్చిన అద్భుతమైన ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయనీ, యూత్ హాబీ సెంటర్ (వైహెచ్సి) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందనీ కటారా జనరల్ మేనేజర్ చెప్పారు. ఖతార అలాగే యూరోప్ మరియు యూకేలలో ఈ ఫొటోల్ని తీశారు ఫొటోగ్రాఫర్. ప్రాచీన అరబ్ వర్డ్ 'అల్ అదియత్' నుంచి ఈ ఎగ్జిబిషన్ పేరుని తీసుకున్నారు.దీని అర్థం 'హార్సెస్ స్టార్మింగ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్' అని. అరేబియన్ కల్చర్లో గుర్రానికి ఎంతో ప్రాధాన్యత వుంది. 2009లో తాను ఈక్విన్ ఫొటోగ్రఫీని హాబీగా మలచుకున్నట్లు ఫొటోగ్రాఫర్ హమ్మాద్ చెప్పారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?