గన్నవరం నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసు:ఏపీఏడీసీఎల్‌

- January 14, 2019 , by Maagulf
గన్నవరం నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసు:ఏపీఏడీసీఎల్‌

అమరావతి:గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు నేరుగా విమానాన్ని నడిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ప్రజాభిప్రాయానికి ఇటీవల శ్రీకారం చుట్టింది. సింగపూర్‌కు విమాన సర్వీస్‌ ప్రవేశపెట్టే ముందు కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. అప్పట్లో 60 వేల మందికిపైగా ఆన్‌లైన్‌లో సానుకూలతను వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి లోటు భర్తీ నిధి (వీజీఎఫ్‌) సమకూర్చే అవకాశం లేకుండానే గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడుస్తోంది. దుబాయ్‌కు ప్రవేశపెట్టే సర్వీసుపైనా ఆన్‌లైన్‌లో  55వేల మందికిపైగా అనుకూలతను వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి దుబాయ్‌ వెళ్లే వారు హైదరాబాద్‌ వెళ్లి ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చాక ఇక్కడి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. సింగపూర్‌ విమాన సర్వీసు విజయవంతం కావడంతో ఇప్పుడు దుబాయ్‌ కోసం ఏపీఏడీసీఎల్‌ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల నుంచి అనతి కాలంలో మంచి స్పందన రావడంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. లోటు భర్తీ నిధి విధానంలో గన్నవరం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడిపేందుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ నెలాఖరులో విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలవనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com