లేబర్‌ చట్టం ఉల్లంఘన: 2018లో 4,500 మంది వలసదారుల డిపోర్టేషన్‌

- January 14, 2019 , by Maagulf
లేబర్‌ చట్టం ఉల్లంఘన: 2018లో 4,500 మంది వలసదారుల డిపోర్టేషన్‌

మస్కట్‌: 4,500 మందికి పైగా వలసదారుల్ని 2018లో దేశం నుంచి డిపోర్టేషన్‌ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ పేర్కొంది. 5,000 మంది వరకు వలసదారుల్ని అరెస్ట్‌ చేయడం కూడా జరిగిందని మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది. మొత్తంగా 4,557 మందిని 2018లో డిపోర్ట్‌ చేశారు. 5,413 మందిని అరెస్ట్‌ చేశారు. లేబర్‌ చట్టంలోని పలు నిబంధనల్ని వీరు ఉల్లంఘించారు. మే 6 నుంచి మే 12 మధ్య మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ 764 మందిని అరెస్ట్‌ చేసింది. 2018లో ఒకేసారి జరిగిన అరెస్టుల్లో ఇదే అత్యధికం. అక్టోబర్‌లో 672 మందిని అరెస్ట్‌ చేశారు. సెప్టెంబర్‌లో 636 మంది అరెస్టయ్యారు. అక్టోబర్‌లో 1,481 మందిని డిపోర్ట్‌ చేయగా, నవంబర్‌లో 1,078 మంది డిపోర్ట్‌ అయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com