‘శ్రీదేవి బంగ్లా’లో అసలేం జరుగుతోంది: ఎందుకు బోనీ కపూర్ ఫైర్!!
- January 17, 2019
ఆమె టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్లోకి అడుగు పెట్టింది అక్కడ కూడా తన మార్క్ చూపించి నెంబర్ వన్ హీరోయిన్గా వెలిగింది శ్రీదేవి. కానీ అర్థాంతరంగా బాత్టబ్లో పడిపోయి మరణించినట్లు వార్త. అభిమానులు ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోయారు. అందాల తార మరణంపై ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఇంకా అభిమానుల్ని వెంటాడుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో మలయాళీ బ్యూటీ ప్రియా వారియర్ కన్నుగీటి తను నటించిన మొదటి చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమెతో బాలీవు్ దర్శక నిర్మాతలు ఓ సినిమా మొదలు పెట్టారు. ఆ చిత్రానికి శ్రీదేవి బంగ్లా అని టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై పెద్ద చర్చకు దారి తీసింది.
టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రియా ప్రకాష్ ఈ చిత్రంలో ఓ స్లార్ హీరోయిన్. ఆమె జీవితంలో ఒడిదుడుకులు, బాధలు, మద్యానికి బానిస కావడం ఇలాంటి అనేక ఆసక్తికర అంశాల తరువాత చివర్లో బాత్ టబ్లో పడిపోయినట్లుగా కాళ్లు మాత్రమే కనిపించే సీన్స్తో టీజర్ ముగించారు చిత్ర యూనిట్. అయితే ఈ టీజర్ తన భార్య శ్రీదేవి చివరి మజిలీకి దగ్గరగా ఉన్నాయని భావించిన బోనీ కపూర్ ఈ చిత్రంపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఆ చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపించారు.
ఆ సినిమాలో ఏముందో ముందు తనకు చూపించిన తరువాతే సినిమాను విడుదలచేయాలని బోనీ నోటీసు సారాంశం. దానికి శ్రీదేవి బంగ్లా దర్శకుడు వివరణ ఇచ్చుకుంటూ హీరోయిన్గా మారిన శ్రీదేవి అనే ఓ యువతి కథతో ఈ సినిమా తీశామని అంతకు మించి ఏమీ లేదని చెబుతున్నారు. చిత్ర యూనిట్ కూడా సినిమాకు సంబంధించి ఏ విషయం క్లారిటీగా చెప్పడం లేదన్నది మాత్రం నిర్వివాదాంశం.
సెన్సేషన్ గా మారిన శ్రీదేవి బంగ్లా తర్వాత ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ప్రియా ప్రకాష్ తాను నటించిన రెండో చిత్రంతో కూడా విడుదలకు ముందే ఓ సెన్సేషన్ని క్రియేట్ చేయబోతోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







