'భీష్మ' .. సింగిల్ ఫరెవర్!
- January 17, 2019నితిన్ కథానాయకుడిగా ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీనివాస కల్యాణం' ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తదుపరి చిత్రం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ కుడుముల వినిపించిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయనేది తాజా సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను .. 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా రష్మిక మందన కనిపించనుంది. 'ఛలో' హిట్ తరువాత వెంకీ కుడుముల చేస్తోన్న ఈ సినిమా, నితిన్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం