'భీష్మ' .. సింగిల్ ఫరెవర్!
- January 17, 2019
నితిన్ కథానాయకుడిగా ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీనివాస కల్యాణం' ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తదుపరి చిత్రం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వెంకీ కుడుముల వినిపించిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయనేది తాజా సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను .. 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, నితిన్ జోడీగా రష్మిక మందన కనిపించనుంది. 'ఛలో' హిట్ తరువాత వెంకీ కుడుముల చేస్తోన్న ఈ సినిమా, నితిన్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







