ప్రాణం తీసిన నిద్ర మత్తు
- January 17, 2019
26 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు ధయిద్ నుంచి షార్జాకి వెళుతుండగా బ్రిడ్జి నెంబర్ 10 వద్ద తన కారు ప్రమాదానికి గురికావడంతో ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఆ యువకుడికి నిద్ర ముంచుకు రావడంతో నిద్ర మత్తులో కారుని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కారు అతి వేగంతో దూసుకుపోతోంది. ఈ కారణంగా పలు మార్లు కారు గాల్లోకి ఎగిరి, ఫ్లిప్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినా అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, పరిమిత వేగంతో ప్రయాణించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







