ప్రాణం తీసిన నిద్ర మత్తు
- January 17, 2019
26 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు ధయిద్ నుంచి షార్జాకి వెళుతుండగా బ్రిడ్జి నెంబర్ 10 వద్ద తన కారు ప్రమాదానికి గురికావడంతో ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఆ యువకుడికి నిద్ర ముంచుకు రావడంతో నిద్ర మత్తులో కారుని కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కారు అతి వేగంతో దూసుకుపోతోంది. ఈ కారణంగా పలు మార్లు కారు గాల్లోకి ఎగిరి, ఫ్లిప్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినా అతని ప్రాణాల్ని కాపాడలేకపోయారు. వాహనదారులు అప్రమత్తంగా వుండాలనీ, పరిమిత వేగంతో ప్రయాణించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!







