పూరీ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్
- January 23, 2019
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ప్లాప్లతో ఇబ్బందిపడుతున్నాడు. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' అనే ఫిల్మ్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు, ఒపెనింగ్ షాట్ వంటివి బుధవారం హైదరాబాద్లో జరిగాయి. దీనికి ఇండస్ర్టీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుతోనైనా సరైన హిట్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు పూరీ.
ఆ మధ్య దీనికి సంబంధించి ఫస్ట్ లుక్తోపాటు టైటిల్ విడుదలైంది. దీంతో అంచనాలు భారీగానే పెరిగాయి. ఇందులో హీరోయిన్గా అను ఇమ్మాన్యుయేల్ని తీసుకోవాలని భావిస్తున్నాడట. ఆమెని సంప్రదించి మాట్లాడడం కూడా జరిగిపోయిందని టాక్. అనుతోపాటు మరో హీరోయిన్కీ ఇందులో నటించే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్టు జరిగితే మే లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది పూరి ప్లాన్. ఈ ప్రాజెక్టుకి ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







