ఈ వేదిక నుంచి తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తానని స్పష్టం చేసిన నాగబాబు
- January 23, 2019
హైదరాబాద్: చిన్నపిల్లలు దేవుడులాంటి వారనీ, వాళ్లకు కల్లాకపటం తెలియదని చిన్నప్పుడు ఓ పాట వినేవాళ్లమని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. పిల్లలు ఎప్పుడూ నిజాలే మాట్లాడుతారనీ, చెడుమాటలు ఉండవని వ్యాఖ్యానించారు. తాను 'మై ఛానల్ నా ఇష్టం' పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను పెట్టానని పేర్కొన్నారు. ఈ వేదిక నుంచి తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ నిర్వహించిన ఓ సభలో 'ఎలాంటి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది టీడీపీనే' అంటూ లోకేశ్ పొరపాటున చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఈ వీడియోలో ప్రస్తావించారు. 'ఇంత నిజాయతీగా ముందుకు వచ్చి మీ పార్టీ గురించి నిజాలు చెప్పినందుకు థ్యాంక్యూ లోకేశ్ గారూ' అని చెప్పారు. ఇంత నిజాయతీగా ఉండటం దేశంలోని ఏ రాజకీయ నాయకుడికీ సాధ్యం కాదని కితాబిచ్చారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







