ఈ వేదిక నుంచి తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తానని స్పష్టం చేసిన నాగబాబు
- January 23, 2019
హైదరాబాద్: చిన్నపిల్లలు దేవుడులాంటి వారనీ, వాళ్లకు కల్లాకపటం తెలియదని చిన్నప్పుడు ఓ పాట వినేవాళ్లమని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. పిల్లలు ఎప్పుడూ నిజాలే మాట్లాడుతారనీ, చెడుమాటలు ఉండవని వ్యాఖ్యానించారు. తాను 'మై ఛానల్ నా ఇష్టం' పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను పెట్టానని పేర్కొన్నారు. ఈ వేదిక నుంచి తన రాజకీయ విమర్శలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ నిర్వహించిన ఓ సభలో 'ఎలాంటి బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది టీడీపీనే' అంటూ లోకేశ్ పొరపాటున చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఈ వీడియోలో ప్రస్తావించారు. 'ఇంత నిజాయతీగా ముందుకు వచ్చి మీ పార్టీ గురించి నిజాలు చెప్పినందుకు థ్యాంక్యూ లోకేశ్ గారూ' అని చెప్పారు. ఇంత నిజాయతీగా ఉండటం దేశంలోని ఏ రాజకీయ నాయకుడికీ సాధ్యం కాదని కితాబిచ్చారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







