కూలిన ఆనకట్ట..200 మంది గల్లంతు

- January 26, 2019 , by Maagulf
కూలిన ఆనకట్ట..200 మంది గల్లంతు

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆనకట్ట కూలడంతో దాదాపు తోమ్మిది ప్రాణాలు కోల్పోగా 300 మంది గాయపడ్డారు. చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద ఘటన తెలుసుకున్న అధికారులు సంఘటన స్ధలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. బెలో హారిజాంటే ప్రాంతంలో నిర్మించిన ఈ ఆనకట్టను బ్రెజిల్‌లోని మైనింగ్‌ దిగ్గజం వాలే కంపెనీ వ్యర్థపదార్థాలను వేసేందుకు ఉపయోగిస్తుంది. శిథిలావస్థకు చేరుకున్న ఆ డ్యామ్ ఒక్కసారిగా తెగి భవన సముదాయాన్ని ముంచెత్తింది.ఇక్కడ నివిస్తున్న వారంతా గని కార్మకులే. బురుద ఒక్కసారిగా ముంచేత్తడంతో చాలా మంది దానిలో ఇరుక్కుపోయారు. 200 మంది వరకు గల్లంతైనట్లుగా సమాచారం. అధికారులు ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీశారు.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com