బైక్ రైడింగ్ ప్రియుల కోసం అకాడమీ ప్రారంభం
- January 28, 2019
బహ్రెయిన్:బైక్ రైడింగ్ మీద ప్రత్యేక ఆసక్తి గలవారి కోసం కింగ్డమ్లో అకాడమీ ప్రారంభమయ్యింది. అడిబీ రేసింగ్ అకాడమీ 2018లో ఏర్పాటు చేశారు. ప్రొఫెషనల్ రేసర్ అలి అడిబి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మూడు రోజుల ప్రోగ్రామ్ని బైక్ రైడర్స్ కోసం ఈ అకాడమీలో అందుబాటులోకి తెచ్చారు. అడిబి రేసింగ్, బహ్రెయిన్కి ప్రాతినిథ్యం వహిస్తోన్న ప్రీమియర్ మోటర్ బైక్ రేసింగ్ టీమ్. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ రేసింగ్ సంస్థ పలు రేస్లలో పాల్గొంది. మినీ మోటర్ బైక్ల మీద శిక్షణ ఇస్తామనీ, వీటి ఖరీదు తక్కువనీ, అదే సమయంలో భద్రత పరంగా ఎంతో మెరుగైనవనీ అడిబి చెప్పారు. భవిష్యత్తులో తమ సంస్థ కార్యకలాపాల్ని మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. రైడర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం రిక్రూట్ చేయడం ద్వారా స్థానిక రేసర్స్, ప్రపంచ స్థాయిలో సత్తా చాటేందుకు వీలుంటుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- జెన్జీ ఎఫెక్ట్తో కొత్త పార్టీ.. నేతాజీ వారసుడి సంచలన ప్రకటన
- సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు
- కువైట్లో ఆగస్టు 27న ప్రభుత్వ సెలవు..!!
- ఎండలో కార్మికుడు కుప్పకూలితే ఏం చేయాలి? బహ్రెయిన్లో ప్రత్యేక శిక్షణ..!!
- ఒమన్లో త్వరలో ‘కన్స్యూమర్ పాస్పోర్ట్’ సర్వీస్..!!
- 183కి పైగా దేశాల్లో యూఏఈ ‘జైవాన్’ కార్డుల వినియోగం..!!
- డీప్ఫేక్లపై ఖతార్ హోంశాఖ హెచ్చరిక..!!
- రెస్టారెంట్లలో ఉల్లంఘనలపై కెమెరాలతో నిఘా..!!
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!







