70వ భారత రిపబ్లిక్‌ వేడుకల్ని నిర్వహించిన ఇండియన్‌ ఎంబసీ

- January 29, 2019 , by Maagulf
70వ భారత రిపబ్లిక్‌ వేడుకల్ని నిర్వహించిన ఇండియన్‌ ఎంబసీ

మస్కట్‌: ఇండియన్‌ ఎంబసీ, 70వ భారత రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకల్ని ఎంబసీ కార్యాలయంలో నిర్వహించింది. ఎంబసీ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, జనవరి 26 ఉదయం 8.30 నిమిషాలకు ఎంబసీ పరిసరాల్లో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. అల్‌ ఖువైర్‌లోని అల్‌ దోవాల్‌ అల్‌ అరేబియా స్ట్రీట్‌లోగల డిప్లమాటిక్‌ ఏరియాలో ఈ వేడుకల్ని నిర్వహించారు. ఒమన్‌లో భారత రాయబారి అయిన మను మహావర్‌, జాఈయ పతాకావిష్కరణ చేశారు. 450 మంది అతిథులకు రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మినిస్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌ డాక్టర్‌ ఫైద్‌ బిన్‌ జాఫర్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ సజ్వాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒమన్‌లో స్థిరపడ్డ భారత కళాకారులు పలు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com