మమ్ముట్టితో తొలిసారి సన్నీలియోన్
- January 29, 2019హాట్ బ్యూటీ సన్నీలియోన్ బాలీవుడ్ కంటే సౌత్పై ఎక్కువగా ఫోకస్ చేసిందా? అవుననే అంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. మోలీవుడ్లో ఈమెకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇటీవల ఓ మొబైల్ షాపు ఓపెనింగ్కి కేరళకు వెళ్లిన సన్నీని చూసేందుకు యూత్ ఓ రేంజ్లో ఎగబడింది. దీన్ని గమనించిన కొందరు ప్రొడ్యూసర్లు.. ఆమె క్రేజ్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో మమ్ముట్టితో 'మధుర రాజా' సినిమా మొదలుపెట్టేశారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సన్నీలియోన్ స్పెషల్సాంగ్ చేస్తోంది. మమ్ముటితో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది సన్నీ. ఈ సాంగ్ మూవీకే హైలైట్ అని చెబుతోంది యూనిట్. అందుకు సంబంధించిన పిక్ సోషల్మీడియాలో వైరల్గా మారింది.
షెడ్యూల్ ప్రకారం ఈ ఫిల్మ్ని ఏప్రిల్లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. వైశాఖ్ డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్లో తమిళ నటుడు జై, జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్