మౌంటెయిన్స్లో ఇరుక్కుపోయిన ఎమిరేటీస్: రక్షించిన పోలీస్
- January 29, 2019ఇద్దరు ఎమిరేటీలు వాడి అల్ బిహ్ ప్రాంతంలోని డీప్ మౌంటెయిన్ స్లోప్లో ఇరుక్కుపోగా, వారిని రస్ అల్ ఖైమా పోలీసులు అత్యంత చాకచక్యంగా రక్షించారు. సోమవారం రాత్రి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. అంబులెన్స్ సాయంతో సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 50 మీటర్ల దిగువన వారిని గుర్తించిన పోలీసులు, అత్యంత చాకచక్యంగా కాపాడి, అవసరమైన వైద్య చికిత్స అందించారు. రస్ అల్ ఖైమా నిర్వాసితులైన ఆ ఇద్దరూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సాహసోపేతమైన చర్యలకు దిగేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
- పతంజలికి మరో షాక్.. 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు