ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు విముక్తి
- January 29, 2019
హైదరాబాద్:ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 14మంది ఏజెంట్ చేతిలో మోసాపోయి ఐదు నెలలుగా నరక యాతన అనుభవించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇరాక్ లో చిక్కున్న వారిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంది. దీంతో రేపు ఉదయం హైదరాబాద్ కు బాధితులు చేరుకోనున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఐదు నెలలపాటు ఒకే గదిలో బందీలుగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. తమ వారిని ఎలాగైనా కాపాడాలని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సమస్యను పాట్కూరి బసంత్ రెడ్డి(గల్ఫ్ తెలంగాణ వర్కర్స్ వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్) ఎంపీ కవితకు తెలియజేసారు. విదేశాంగ శాఖతో మాట్లాడి, ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది తెలంగాణ కార్మికులను స్వదేశానికి రప్పించడంలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారు. చొరవ తీసుకుని 14 మందికి విముక్తి కలిగించినందుకు బాధిత కుటుంబాలు ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







