ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు విముక్తి

- January 29, 2019 , by Maagulf
ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు  విముక్తి

హైదరాబాద్:ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 14మంది ఏజెంట్ చేతిలో మోసాపోయి ఐదు నెలలుగా నరక యాతన అనుభవించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇరాక్ లో చిక్కున్న వారిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంది. దీంతో రేపు ఉదయం హైదరాబాద్ కు బాధితులు చేరుకోనున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఐదు నెలలపాటు ఒకే గదిలో బందీలుగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. తమ వారిని ఎలాగైనా కాపాడాలని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సమస్యను పాట్కూరి బసంత్ రెడ్డి(గల్ఫ్ తెలంగాణ వర్కర్స్ వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్) ఎంపీ కవితకు తెలియజేసారు. విదేశాంగ శాఖతో మాట్లాడి, ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది తెలంగాణ కార్మికులను స్వదేశానికి రప్పించడంలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారు. చొరవ తీసుకుని 14 మందికి విముక్తి కలిగించినందుకు బాధిత కుటుంబాలు ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com