ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు విముక్తి
- January 29, 2019హైదరాబాద్:ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 14మంది ఏజెంట్ చేతిలో మోసాపోయి ఐదు నెలలుగా నరక యాతన అనుభవించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇరాక్ లో చిక్కున్న వారిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంది. దీంతో రేపు ఉదయం హైదరాబాద్ కు బాధితులు చేరుకోనున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఐదు నెలలపాటు ఒకే గదిలో బందీలుగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. తమ వారిని ఎలాగైనా కాపాడాలని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సమస్యను పాట్కూరి బసంత్ రెడ్డి(గల్ఫ్ తెలంగాణ వర్కర్స్ వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్) ఎంపీ కవితకు తెలియజేసారు. విదేశాంగ శాఖతో మాట్లాడి, ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది తెలంగాణ కార్మికులను స్వదేశానికి రప్పించడంలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారు. చొరవ తీసుకుని 14 మందికి విముక్తి కలిగించినందుకు బాధిత కుటుంబాలు ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు