ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు విముక్తి
- January 29, 2019
హైదరాబాద్:ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది బాధితులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 14మంది ఏజెంట్ చేతిలో మోసాపోయి ఐదు నెలలుగా నరక యాతన అనుభవించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇరాక్ లో చిక్కున్న వారిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంది. దీంతో రేపు ఉదయం హైదరాబాద్ కు బాధితులు చేరుకోనున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఐదు నెలలపాటు ఒకే గదిలో బందీలుగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. తమ వారిని ఎలాగైనా కాపాడాలని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ సమస్యను పాట్కూరి బసంత్ రెడ్డి(గల్ఫ్ తెలంగాణ వర్కర్స్ వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్) ఎంపీ కవితకు తెలియజేసారు. విదేశాంగ శాఖతో మాట్లాడి, ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది తెలంగాణ కార్మికులను స్వదేశానికి రప్పించడంలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారు. చొరవ తీసుకుని 14 మందికి విముక్తి కలిగించినందుకు బాధిత కుటుంబాలు ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







