హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ను ప్రారంభించిన ఇస్రో!

- January 31, 2019 , by Maagulf
హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ను ప్రారంభించిన ఇస్రో!

2021లో మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్ యాన్'ను చేపడతామని ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామని అప్పట్లో చెప్పింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. తాజాగా ఈ ప్రాజెక్టులో భాగంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 'హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్'ను ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ ప్రారంభించారు. మానవసహిత యాత్రకు వెళ్లే వ్యోమగాములు ఇక్కడే శిక్షణ పొందనున్నారు. మరోవైపు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేందుకు అవసరమైన మాడ్యుల్ ను సైతం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com